ది ఈగల్ న్యూస్ : హైదరాబాద్
- పాపయ్య మృతి ప్రింటింగ్ ప్రెస్ లోకానికి తీరని లోటు
- అన్ని వర్గాల ప్రజల మనసు గెలుచుకున్న నారబోయిన పాపయ్య ముదిరాజ్
- పాపయ్య చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన పలువురు ప్రముఖులు
యాదాద్రి భువనగిరి జిల్లా ,మోత్కూరు పురపాలిక పరిధిలోని లక్ష్మీ నరసింహా ప్రింటింగ్ ప్రెస్ తో గత నలభై ఏళ్ళకు పైగా వివాహ ఆహ్వాన పత్రికలు, కరపత్రాల ప్రచురణలో అన్ని వర్గాల ప్రజల మనసు గెలుచుకున్న నారబోయిన పాపయ్య ముదిరాజ్ మృతి ప్రింటింగ్ ప్రెస్ లోకానికి తీరని లోటని కాంగ్రెస్ పార్టీ పట్టన అధ్యక్షుడు గుండగోని రామచంద్ర గౌడ్ మరియు ముదిరాజ్ సంఘం ప్రధాన కార్యదర్శి కోమటి మత్స్య గిరి సంయుక్తంగా ప్రకటన ద్వారా తెలిపారు.ఈ రోజు మోత్కూర్ లోజరిగిన పాపయ్య దశ దిన కార్యక్రమంలో పాల్గొని పాపయ్య చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామన్నపేట పాత తాలూకా స్థాయిలో అట్టడుగు వర్గాల వారికి అతి తక్కువ ఖర్చుతో ఆహ్వాన పత్రికలు ముద్రించిన గొప్ప మనసున్న వ్యక్తి ప్రింటింగ్ ప్రెస్ పాపయ్య అని అన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఉచితంగా ఆహ్వాన పత్రికలు అందించిన ఆదర్శ మూర్తి పాపయ్య అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో పట్టూరీ అంజయ్య,ఉయ్యాల అంజయ్య, బయ్యని రాజు, బుర్ర యాదయ్య,కనుకు రాజు,పోచం కన్నయ్య,బద్ది పడిగ సంతోష్, కనుకు మత్స్య గిరి, వెంకన్న,రాములు పాపయ్య కు నివాళులు అర్పించారు .